నవీన్ చంద్ర సరసన పంజాబీ సుందరి!

  • June 7, 2016 / 01:34 PM IST

నూతన దర్శకుడు సంజీవ్ కుమార్ దర్శకత్వంలో నవీన్ చంద్ర కథానాయకుడిగా తెరకెక్కనున్న చిత్రంలో తొలుత నందిత శ్వేత అనే కన్నడ భామను కథానాయికగా ఎంపిక చేసుకొన్నారు. అయితే.. ఆ అమ్మడికి డేట్స్ సమస్య తలెత్తడంతో ఆమె స్థానంలో పంజాబీ భామ రోనికా సింగ్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది.

శ్రీరాజ్ కథ సమకూర్చిన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూలై నెలలో మొదలుకానుంది. తొలుత ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సన్నీలియోన్ కూడా నటిస్తుందని వార్తలొచ్చాయి. కానీ.. వాటిని సన్నీ భర్త డేనియల్ ఖండించారు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus