మరో సారి పౌరాణిక పాత్ర చేయనున్న నయనతార

  • July 5, 2017 / 11:56 AM IST

కేరళ బ్యూటీ నయన తార గ్లామరస్ పాత్రలతో పాటు పౌరాణిక పాత్రలకు చక్కగా పోషించగలనని నిరూపించుకుంది. శ్రీ రామ రాజ్యం సినిమాలో సీతమ్మ తల్లిగా తెలుగు ప్రేక్షుకుల అభిమానాన్ని చూరగొంది. ఇప్పుడు మరో పౌరాణిక పాత్రలో నటించేందుకు సిద్ధమవుతోంది. ద్రౌపది పాత్రలో నయన నటించనున్నట్లు శాండిల్ వుడ్ వర్గాలు వెల్లడించాయి. బాహుబలి సినిమా స్పూర్తితో తమిళంలో మాదిరిగానే కన్నడలో ఓ భారీ ప్రాజక్ట్ రూపుదిద్దుకోబోతోంది.

మహాభారతం నేపథ్యంలోనే కన్నడలో ‘కురుక్షేత్ర’ అనే ప్రాజెక్టు తెరకెక్కబోతోంది. కన్నడ అగ్రతారలు నటించబోతున్న ఈ చిత్రంలో ద్రౌపది పాత్ర కోసం నయనతారను సంప్రదించారని తెలిసింది. ప్రస్తుతం చర్చల దశలో ఉందని, ద్రౌపదిగా నయన నటించడంపై కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుందని సమాచారం. ప్రస్తుతం నయన తార తమిళంలో నాలుగు సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది. ఈ నాలుగు పూర్తి అయిన తర్వాత  ‘కురుక్షేత్ర’ ప్రాజక్ట్ లోకి అడుగుపెట్టనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus