చిరు, రజిని ఎవరైనా… నారూటే సెపరేటు అంటున్న ‘నయనతార’

  • January 4, 2020 / 01:43 PM IST

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా వెలిగిపోతుంది నయనతార. ప్రస్తుతం ఆమె కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. గత ఏడాది తెలుగులో చిరంజీవి చేసిన సైరా వంటి పాన్ ఇండియా మూవీతో పాటు, తమిళంలో 2019 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బిగిల్ మూవీలో హీరోయిన్ గా చేశారు. అలాగే కొన్నేళ్లుగా ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు బెస్ట్ ఛాయిస్ గా మారిపోయారు. ఇక ఈ ఏడాదిని సూపర్ స్టార్ రజిని నటించిన దర్బార్ వంటి భారీ చిత్రంతో మొదలుపెడుతున్నారు. దర్బార్ చిత్రంలో రజిని భార్యగా నయనతార నటించారని తెలుస్తుంది.

ఎప్పటిలాగే నయనతార దర్బార్ మూవీ ప్రమోషన్స్ లో కూడా పాల్గొనడం లేదు. నిన్న హైదరాబాద్ వేదికగా జరిగిన దర్బార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నయనతార వస్తారని అందరూ భావించారు. ఐతే ఆమె ఈవేడుకకు హాజరు కాలేదు. మెగాస్టార్ చిరంజీవి సైరా ప్రమోషనల్ కార్యక్రమాలతో పాటు, విజయ్ నటించిన బిగిల్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా ఆమె పాల్గొన్న దాఖలాలు లేవు. ఆల్ ఇండియా స్టార్ గా భావించే రజిని కోసమైనా ఆమె తన పాలసీ పక్కనపెట్టి ప్రమోషన్స్ లో పాల్గొంటారు అనుకున్నారందరూ.. కానీ చిరు అయినా రజిని అయినా నా రూటే సపరేటు అంటుంది ఈ భామ. ప్రస్తుతం నయనతార నెట్రి కన్, మూకుతి అమ్మన్ అనే రెండు తమిళ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తున్నారు. దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న ఈ అమ్మడు ఈ ఏడాది అతడిని పెళ్లాడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus