Ananya Panday: డ్రగ్స్ కేసు.. ఆర్యన్ తో అనన్య వాట్సాప్ చాట్!

  • October 22, 2021 / 10:50 AM IST

బాలీవుడ్ ఇండస్ట్రీకి డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ అనన్య పాండే ఎన్సీబీ ఎదుట హాజరైంది. తండ్రి, నటుడు చుంకీ పాండేతో కలిసి ఆమె ఎన్సీబీ కార్యాలయానికి చేరుకుంది. ఈరోజు ఉదయం అనన్య పాండే ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ అధికారులు ఆమె ఫోన్, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు. ఈ నెల 2న జరిగిన క్రూజ్ షిప్ రేవ్ పార్టీలో డ్రగ్స్ కావాలని ఆర్యన్.. అనన్యకు వాట్సాప్ చాట్ చేసినట్లు సమాచారం.

అంతేకాకుండా.. ఈ చాట్ లో అనన్య పాండేతో పాటు ఆర్యన్ సోదరి సుహానా ఖాన్ కూడా ఉన్నట్లు సమాచారం. వీరంతా స్టార్ హీరోల పిల్లలు కావడంతో అందరికీ ఓ కామన్ వాట్సాప్ గ్రూప్ ఉన్నట్లు తెలుస్తుంది. 2019లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఆ తరువాత ‘పతి పత్ని ఔర్ వాహ్’తో మంచి విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం ఈ భామ ఒక హిందీ సినిమాతో పాటు.. తెలుగులో ‘లైగర్’ సినిమాలో నటిస్తోంది. హీరోయిన్ గా ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా కొట్టకపోయినా.. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus