Neelambari Song: ‘దేవదాస్’ లోని ‘వారు వీరు’ ని తలపించింది..!

  • November 5, 2021 / 01:03 PM IST

మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. మెగాస్టార్ కెరీర్‌లో 153వ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానులంతా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, ‘లాహే లాహే’ పాటకి ప్రేక్షకుల నుండీ విశేషదారణ దక్కింది. తాజాగా ‘ఆచార్య’ నుండీ రెండో పాటని కూడా విడుదల చేశారు.

ఇది పూర్తిగా రాంచరణ్- పూజా హెగ్డే ల మధ్య సాగే రొమాంటిక్ నెంబర్ అని చిత్ర బృందం ముందే వెల్లడించింది. ‘రంగస్థలం’ చిత్రంలో ‘జిగేల్ రాణి’ అనే మాస్ పాటకి చిందులేసి తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసారు చరణ్, పూజా హెగ్డే. ఈసారి వాళ్ళిద్దరూ ‘ఆచార్య’ లో ‘నీలాంబరి’ అనే రొమాంటిక్ పాటలో కనిపించడం విశేషం. ఈ పాటకి అనంత్ శ్రీరామ్ అందించిన లిరిక్స్ బాగున్నాయి.అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఎంతో హుషారుగా ఈ పాటని పాడారు.

సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన ట్యూన్ కాస్త ‘దేవదాస్’ లోని ‘వారు వీరు’ అనే పాటని తలపించింది. అయినప్పటికీ హుషారెత్తించే విధంగానే ఉంది. ఈ పాటకి సంబంధించిన ప్రోమోని రెండు నిన్ననే విడుదల చేశారు. అందులో విజువల్స్ చూస్తుంటే దర్శకుడు కొరటాల శివ మేకింగ్ విషయంలో ఏమాత్రం రాజీపడడు అనే మరోసారి స్పష్టంచేసింది. మొత్తానికి ‘నీలాంబరి’ పాట వినసొంపుగానే ఉంది. మీరు కూడా ఓసారి వినెయ్యండి :

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus