యూత్ కి కనెక్ట్ అయ్యే “నీతో” మూవీ ట్రైలర్

Ad not loaded.

అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరోహీరోయిన్లుగా, డైరెక్టర్ బాలు శర్మ దర్శకత్వం వహించిన మూవీ “నీతో”. పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.రిలీజ్ చేసిన ట్రైలర్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. “మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్ అయిందో గుర్తుంటుంది కానీ, ఎలా స్టార్ట్ అవుతుందో గుర్తురాదు”లాంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ట్రైలర్ మొదటి నుండి చివరి వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆసక్తికరంగా మలిచారు చిత్ర యూనిట్.

వివేక్ సాగర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చగా, సుందర్ రామ కృష్ణ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన ‘నీతో’ ఈ నెల 30వ తారీఖున థియేటర్లలో విడుదలవ్వబోతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus