సాగర్ చంద్ర ఆ రేంజ్ లో సినిమా చూపిస్తాడా..?

  • February 18, 2021 / 06:06 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాడు. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కి రెడీ అయిపోతోంది. ఆ తర్వాత క్రిష్ తో చారిత్రాత్మకమైన సినిమా, అయ్యప్పన్‌ కోషియామ్‌ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. రానాతో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాకి మాటలు – రచన సహకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి బిల్లారంగా టైటిల్, పరుశురామ కృష్ణమూర్తి అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.

ఇక్కడ వరకూ కథ బాగానే ఉంది.., అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ఇస్తున్న స్క్రిప్ట్ వర్క్ సాగర్ చంద్రకి నచ్చడంలేదట. అందుకే ఎన్నో మార్పులు జరుగుతున్నాయని సమాచారం. మాటల మాంత్రికుడు స్క్రిప్ట్ నచ్చకపోవడం ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నో మార్పులు చేర్పులతో కూడిన స్క్రీన్ ప్లే ని ఇస్తున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. రానా, పవన్ కళ్యాణ్ ల క్రేజ్ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నట్లుగా వినికిడి. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్లో సినిమా తీస్తే జనాలకి బాగా ఎక్కుతుంది కానీ, ఆయన రాస్తే ఎక్కదు అంటూ చెప్తున్నారు సినీ విమర్శకులు. గతంలో ఇలాగే పవన్ కళ్యాణ్ సినిమా అయిన తీన్ మార్ కి స్క్రీన్ ప్లే , మాటలు అందించాడు త్రివిక్రమ్.

కానీ ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. అలాగే కొన్ని సినిమాలకి రచనా సహకారాన్ని కూడా అందించాడు. త్రివిక్రమ్ స్టైల్లో సినిమా తీస్తే అద్దిరిపోతుంది కానీ, వేరే సినిమాలకి ఆయన డైరెక్షన్ చేయకుండా కేవల్ రాస్తే వర్కౌట్ అవ్వదని అంటున్నారు. మరి ఈసినిమాకి స్క్రిప్ట్ పరంగా ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. తెలుగు నేటివిటిలో ఎలాంటి మార్పు ఉండకూడదనే ఉద్దేశ్యంతో పొలాచ్చిలో షూటింగ్‌ షెడ్యూల్స్ ని సైతం ప్లాన్‌ చేశారట. హీరోయిన్లుగా సాయిపల్లవి, ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అదీ విషయం.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus