మన్మధునితో రొమాన్స్ కి సై అంటున్న యువ హీరోయిన్

  • October 27, 2018 / 11:02 AM IST

మున్నా మైఖేల్ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన బ్యూటీ నిధి అగర్వాల్… తెలుగులో నాగచైతన్యకి జోడీగా సవ్యసాచి సినిమా ద్వారా పరిచయమవుతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 2 న రిలీజ్ కానుంది. ఈ మూవీ రిలీజ్ కాకముందే అక్కినేని మరో హీరో పక్కన ఛాన్స్ అందుకుంది. హలో తర్వాత అక్కినేని ప్రిన్స్ .. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో హీరోయిన్ గా నిధి చేస్తోంది. కెరీర్ మొదట్లోనే అక్కినేని బ్రదర్స్ తో నటించే అవకాశాన్ని అందుకున్న ఈ భామకి .. మన్మధుడు అక్కినేని నాగార్జునతో కలిసి నటించాలని ఉందని చెప్పింది.

సవ్యసాచి ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన నిధి మాట్లాడుతూ “హైదరాబాద్ అంటే నాకెంతో ఇష్టం. హైదరాబాద్‌లో ఉన్నన్ని రోజులు పూర్ణ టిఫిన్ సెంటర్‌లో ఇడ్లీలు తింటూ, ఐమాక్స్‌లో సినిమాలు చూస్తూ హాయిగా గడిపేశాను. ప్రస్తుతం అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’ ప్రాజెక్టులో భాగమయ్యాను. కుదిరితే నాగార్జునతో కూడా చేయాలనుంది” అని పేర్కొంది. మరి అక్కినేని నాగార్జున నిధి కోరికను ఎప్పుడు తీరుస్తారో చూడాలి. అతనితో కూడా నటిస్తే అక్కినేని వారి హీరోయిన్ అనే పేరు కూడా వచ్చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus