నాగార్జున, ఎన్టీఆర్ పై నిరోషా కామెంట్స్..!

  • June 20, 2019 / 05:56 PM IST

మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ‘ఘర్షణ’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది సీనియర్ హీరోయిన్ నిరోషా. అటుతరువాత మెగాస్టార్ చిరంజీవితో ‘స్టువర్టుపురం పోలీస్ స్టేషన్’, బాలకృష్ణతో ‘నారి నారి నడుమ మురారి’, మోహన్ బాబు తో ‘డిటెక్టివ్ నారద’ వంటి చిత్రాల్లో నటించింది. అవకాశాలైతే బానే దక్కించుకుంది కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఇక ఆమెకు పెళ్ళైన తరువాత సినిమాలకి కాస్త గ్యాపిచ్చి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం స్లో గానే ఉన్నాయి.

ఇదిలా అండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది నిరోషా. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “సీనియర్ హీరోల్లో నాకు నాగార్జున గారంటే చాలా ఇష్టం. ఇప్పటి హీరోల్లో అయితే ఎన్టీఆర్ ఎక్కువ ఇష్టం. కెరియర్ ప్రారంభంలో ఎన్టీఆర్ చేసిన పాత్రలు .. ఆ తరువాత చేసిన పాత్రలు చూస్తే తన నటనలో పరిపక్వత స్పష్టంగా కనిపిస్తుంది. నటన .. డాన్స్ .. ఫైట్స్ .. ఇలా అన్నిటిలోనూ ఆయన అద్భుతంగా చేస్తాడు. అందుకే తన సినిమాలు.. ఫస్ట్ డే.. ఫస్ట్ షో చూసేస్తుంటాను. ఇక ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం వస్తే… అంతమించిన అదృష్టం లేదనే భావిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus