పవన్ కళ్యాణ్ చిత్రం విషయంలో వచ్చిన వార్తను ఖండించిన నివేతా

  • December 19, 2016 / 02:05 PM IST

కాటమరాయుడు తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్ తమిళ దర్శకుడు ఆర్‌టి నీసన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. తమిళంలో విజయం సాధించిన ‘వేదాళం’ చిత్రానికి రీమేక్‌గా దీన్ని తెరకెక్కించనున్నారు. ప్రముఖ నిర్మాత ఏ ఏం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్ గా సాయేషా సైగల్ నటించనుంది. మాతృకలో హీరో అజిత్ చెల్లెలిగా లక్ష్మి మీనన్ పోషించిన పాత్రను తెలుగులో నివేతా థామస్‌  పోషిస్తున్నారని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది.

దీనిపై ఈ కేరళ నటి సోమవారం ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. తాను పవన్‌ సోదరి పాత్రను తాను పోషించడం లేదని స్పష్టం చేశారు. ‘జెంటిల్‌మన్‌’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ‘క్షమించండి.. ఇది నిజం కాదు’ అని ట్వీట్‌ చేశారు. ఇంతటితో ఈ రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. మరి ఆ పాత్రలో ఎవరు కనిపించనున్నారబ్బా? అనే ప్రశ్న మాత్రం ప్రశ్నగానే ఉండిపోయింది. ఇంతకీ ఆ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus