యాంకర్ శ్యామల (Shyamala).. ఒకప్పుడు హ్యాపీగా యాంకరింగ్ చేసుకునేది.అలా వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో ఛాన్సులు కూడా కొట్టింది. ఒకవేళ సినిమాల్లో ఛాన్సులు తగ్గినా టీవీ షోలు ఎలాగూ ఉండేవి కాబట్టి.. ఆమెకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఎందుకో సడన్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వైసీపీ పార్టీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తూ వస్తుంది.
గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ఈమె నోరు పారేసుకుంది. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఈమెను ఘోరంగా ట్రోల్ చేశారు. ‘నక్క, తోడేలు, కుందేలు’ అంటూ పవన్ గురించి ఈమె చెప్పిన కథలపై కూడా వాళ్ళు దారుణంగా ఫైర్ అయ్యారు. ‘ఈమె చీకటి బాగోతాలు’ అంటూ పాత విషయాలు బయటకి తీసి మరీ ఈమెను విమర్శించారు.
ఇక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయింది. శ్యామల (Shyamala) అంచనా కూడా తప్పయింది. సరే రాజకీయాల్లో ఇప్పుడు ఆమె రాణించేది ఏమీ లేదు కదా అని భావించి కొన్నాళ్ళు సైలెంట్ గా ఉంది. మరోపక్క తిరిగి సినిమాల్లో, బుల్లితెర షోలలో బిజీ అవ్వాలని భావించింది. కానీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి వాల్యూ ఇచ్చే వాళ్ళు ఎక్కువ. ఆ ఫ్యామిలీని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించే వాళ్ళు కూడా ఎక్కువే. అందుకే శ్యామల (Shyamala) కి సినీ పరిశ్రమలో అవకాశాలు కరువయ్యాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె క్షమాపణలు చెప్పినా ఫలితం లేకుండా పోయింది.
ఇప్పుడైతే శ్యామల (Shyamala) కి వైసీపీ పార్టీ తరఫున ప్రమోషన్స్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ఏదో ఒక సెటైర్ వేసి హైలెట్ అవ్వడానికి చూస్తుంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కనబడుటలేదు అంటూ ఆమె సెటైర్లు విసిరింది. వీటికి కొంతమంది పవన్ అభిమానులు గట్టిగా కౌంటర్ ఇస్తున్నా.. మరికొంతమంది ‘ఈమెను పట్టించుకోనవసరం లేదు.. అటెన్షన్ కోసం ట్రై చేస్తుంది.. లైట్ తీసుకోండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.