Paruchuri Brothers: పరుచూరి వారసుడి టీజర్ లాంచ్.. ఇంత సాధాసీదాగానా?

  • September 2, 2024 / 07:15 PM IST

హీరోల వారసులు హీరోలు అవ్వడం, నిర్మాతల వారసులు హీరోలు అవ్వడం.. అనేది టాలీవుడ్లో చూస్తూనే ఉన్నాం. వాళ్లలో చాలా మంది మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ డైరెక్టర్ల వారసులు, రైటర్ల వారసులు హీరోలుగా ఎంట్రీలు ఇచ్చినా… నిలబడలేకపోవడం వంటివి కూడా టాలీవుడ్లోనే చూస్తున్నాం. మిగతా భాషల సినీ పరిశ్రమలతో పోలిస్తే.. టాలీవుడ్ డైరెక్టర్ల వారసులు, రైటర్ల వారసులు సక్సెస్ కాలేకపోతున్నారు. ఇందుకు కారణాలు ఏంటి? అన్నది ఎవ్వరికీ తెలీదు. సరే అసలు మేటర్లోకి వెళితే..(Paruchuri Brothers) పరుచూరి బ్రదర్స్ కి (Paruchuri Venkateswara Rao) టాలీవుడ్లో ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.

Paruchuri Brothers

ఎందుకంటే.. ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాలు, బ్లాక్ బస్టర్ చిత్రాలు, సూపర్ హిట్ చిత్రాలకు వీరి కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి. ఇప్పుడు వాళ్ళ హవా తగ్గినా.. టాలీవుడ్లో వాళ్ళను కూడా లెజెండ్స్ గానే చాలా మంది చూస్తుంటారు. అలాంటిది వాళ్ళ వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటే.. స్టార్స్ సపోర్ట్ గట్టిగా ఉంటుంది అని అంతా భావిస్తారు. కానీ అలాంటిది జరగడం లేదు. పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) గారి మనవడు పరుచూరి (Paruchuri Brothers) సుద‌ర్శ‌న్ ‘మిస్టర్ సెలబ్రిటీ’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

దీని టీజర్ లాంచ్ ఈరోజు సాదా సీదాగా జరిగింది. టీజర్ ని లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పడానికి టాలీవుడ్ కు చెందిన ఏ స్టారూ రాలేదు. సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) ని తీసేస్తే పెద్దగా స్టార్ మెటీరియల్ కనబడలేదు. ఇక టీజర్ కంటెంట్ విషయానికి వస్తే.. మీడియాపై సెటైర్లు, కౌంటర్లు వేస్తున్నట్టు సీన్స్ కనిపిస్తున్నాయి. మరి రిలీజ్ టైంకి అయినా స్టార్స్ ని తీసుకొచ్చి.. హైప్ తీసుకొచ్చే ప్రయత్నమైనా చేస్తారో లేదో చూడాలి..!

‘జగదేకవీరుడు..’ తర్వాత ‘సరిపోదా..’ కే ఆ గౌరవం దక్కింది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus