ఒకే వేదికపై కనువిందు చేయనున్న బాలకృష్ణ, ఎన్టీఆర్

  • November 15, 2017 / 02:56 PM IST

మొన్నటి వరకు నందమూరి హీరోలందరూ ఒక వైపు.. తారక్ ఒక వైపు అన్నట్టుగా ఉన్నారు. ఆ గీతని చెరిపి వేస్తూ కళ్యాణ్ రామ్ తమ్ముడితో జై లవకుశ సినిమా నిర్మించారు. దీంతో ఎన్టీఆర్ తో నందమూరి కుటుంబసభ్యులందరూ దాదాపు కలిసిపోయారు. కానీ బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ ని దూరంగా ఉంచారు. వారిద్దరూ కలిసిపోతే చూడాలని నందమూరి అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఇలా కోరుకొనే వారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. అందుకే వారిద్దరిని ఒకే వేదికపై తీసుకొచ్చే అవకాశం కల్పించారు.  నిన్న ఏపీ ప్రభుత్వం 2014, 15, 16 సంవత్సరాలకు నంది అవార్డ్‌లను ప్రకటించింది.

ఉత్తమనటుడు కేటగిరీల్లో బాలకృష్ణ (2014 ), మహేష్‌ (2015 ), తారక్(2016 ) లు అవార్డు అందుకోనున్నారు. ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని త్వరలోనే గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, ఎన్టీఆర్‌ వస్తారని.. తప్పకుండా కలిసిపోతారని నారా చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నట్లు సమాచారం. అభిమానులు కూడా అదే ఆశిస్తున్నారు. మరి వారిద్దరి మనసులో ఏముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus