బాలీవుడ్ హీరోయిన్ తో ఎన్టీయార్ రొమాన్స్

  • January 27, 2018 / 01:19 PM IST

‘అజ్ణాతవాసి’ రిలీజ్ తర్వాత ఎన్టీయార్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించబోయే చిత్రం గురించి రకరకాల కథనాలు వచ్చాయి. తొలుత ఈ చిత్రం ఆగిపోయిందని, ఆ తర్వాత ఈ సినిమా కథ కూడా కాపీ అని కొందరు అనగా.. మళ్ళీ యుద్ధనపూడి సులోచనా రాణి వద్ద నుంచే త్రివిక్రమ్ మరో కథ కొన్నాడని కథనాలు వెలువడ్డాయి. ఇంకా చెప్పాలంటే.. సినిమా విషయంలో ఎన్టీయార్ పునః ఆలోచనలో ఉన్నాడని కూడా గాసిప్స్ వినిపించాయి. అయితే.. సినిమా యూనిట్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నారు.

ఈ సినిమాకి సంబంధించి సరికొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీయార్ సరసన కథానాయికగా బాలీవుడ్ కథానాయిక శ్రద్ధ కపూర్ ను ఫైనల్ చేశారట. ప్రస్తుతం “సాహో” షూట్ లో బిజీగా ఉన్న శ్రద్ధ కపూర్ మార్చి నుంచి మొదలవ్వనున్న ఎన్టీయార్ సినిమాలో నటించడం కోసం సమ్మతించ్చిందని వినికిడి. ఇంకా అగ్రిమెంట్ సైన్ అవ్వనప్పటికీ.. టీం కి మాత్రం శ్రద్ధ ఫిక్స్ అని చెప్పేశాడట త్రివిక్రమ్.
ఆల్రెడీ మలయాళంలో మార్కెట్ ఏర్పరుచుకున్న ఎన్టీయార్ ఇప్పుడు తమిళ, హిందీ భాషలకు కూడా తన మార్కెట్ ను విస్తరించేపనిలో ఉన్నందున శ్రద్ధ కపూర్ పై కాన్సన్ ట్రేట్ చేస్తున్నట్లున్నాడు. ఆమె ద్వారా ఎన్టీయార్ కి బాలీవుడ్ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus