ప్రభాస్ ఎంట్రీతో అక్కడే ఆగిపోయిందా?

  • December 22, 2020 / 03:37 PM IST

RRR సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా త్రివిక్రమ్ తో వర్క్ చేయనున్నాడు. అయితే ఆ తరువాత వర్క్ చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ముందు జాగ్రత్తగా చాలా మంది హీరోలు ఇతర దర్శకులతో కథలను సెట్ చేసుకుంటూ ఉంటే ఎన్టీఆర్ మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు. KGF సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ అనంతరం వెంటనే మరో సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నాడు.

అయితే తారక్ ను చాలా రోజులుగా సంప్రదించినప్పటికి ఎందుకో ఆ కాంబో సెట్టవ్వలేదు. సడన్ గా దర్శకుడు ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్నాడు అనగానే రూమర్స్ కు బ్రేక్ పడ్డాయి. నిజానికి ఎన్టీఆర్, ప్రశాంత్ ప్రాజెక్టు ఈ ఏడాదిలోనే స్టార్ట్ కావాల్సింది. కానీ కథపై తారక్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో లేకపోవడం వల్లే ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఇక అదే దర్శకుడి ద్వారా ప్రభాస్ కేవలం కథ మెయిన్ ప్లాట్ గురించి తెలుసుకొని ఓకే చేశాడట.

దీంతో ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందా అనే రూమర్స్ వస్తున్నాయి. లేకపోతే ఇద్దరు చెరొక సినిమాను పూర్తి చేసిన తరువాత వచ్చే ఏడాది సినిమాను స్టార్ట్ చేస్తారా అని అనుమానాలు కూడా వస్తున్నాయి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus