Chiranjeevi, Prabhu Deva: 14ఏళ్ళ తర్వాత ‘శంకర్ దాదా జిందాబాద్’ కాంబో..!

  • August 5, 2021 / 10:39 PM IST

మెగాస్టార్ చిరంజీవి పాండమిక్ ను కూడా పట్టించుకోకుండా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ‘ఆచార్య’ చిత్రం పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు. ఇంకా రెండు పాటలు బ్యాలన్స్ ఉన్నాయి. అయినప్పటికీ లూసీఫ‌ర్ రీమేక్, వేదాళం రీమేక్‌, బాబీ తో మల్టీస్టారర్ ప్రాజెక్టులను లైన్లో పెట్టేసారు.శ్రీను వైట్లతో ‘ఎన్నై అరిందాల్’ ను రీమేక్ చేయాలనే ఆలోచన కూడా ఆయనకి ఉంది.అలాగే మారుతి చెప్పిన క‌థ‌కు కూడా ఇంప్రెస్ అయినట్టు భోగట్టా..! ఇదిలా ఉండగా..

ఇప్పుడు లేటెస్ట్ గా ప్ర‌భుదేవా పేరు కూడా వినిపిస్తుండడం విశేషం. ప్రభుదేవా ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నాడు. కానీ రీమేక్ లతో అయితే తప్ప అక్కడ అతను హిట్టు కొట్టలేకపోతున్నాడు.అక్కడ అతను తెరకెక్కించిన సినిమాలు ప్లాప్ అవుతున్నా.. స్టార్ హీరోల మార్కెట్ తో అవి కమర్షియల్ హిట్స్ గా నిలుస్తున్నాయి.అయితే ఇప్పుడు అతను తిరిగి టాలీవుడ్లో అడుగుపెట్టాలని భావిస్తున్నాడు.2008 వ సంవత్సరంలో చిరుతో `శంక‌ర్ దాదా జిందాబాద్` చేశాడు ప్రభుదేవా. అది ఆడకపోయినా ఇతనితో మరో సినిమా చేస్తానని అప్పుడే మాటిచ్చారు చిరు.

దాంతో ప్ర‌భుదేవా చిరుతో టచ్ లో ఉంటున్నాడట.ప్రభుదేవా రీమేక్‌లు బాగా తీయగలడు.కాబట్టి ఇతనితో కూడా ఓ రీమేక్ మూవీని చేస్తే బెటర్ అని చిరు భావిస్తున్నారు. మరి ఏ రీమేక్ భాద్యతలను ప్రభుదేవాకి అప్పగిస్తారో చూడాలి. ఆల్రెడీ రెండు రీమేక్ లలో నటిస్తున్నారు చిరు. ‘ఎన్నై అరిందాల్’ స్క్రిప్ట్ శ్రీను వైట్ల రెడీ చేయలేకపోతే అది.. ప్రభుదేవాకి వెళ్లే అవకాశం ఉందనేది ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus