మరోసారి ‘కింగ్’ కు జోడీగా లావణ్య త్రిపాఠి…!

  • April 4, 2020 / 01:08 PM IST

‘అందాల రాక్షసి’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా ప్రేక్షకులనందరినీ తన వైపుకు తిప్పుకుంది లావణ్య త్రిపాఠి.అయితే ఈమె కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోవడం లేదు. అలా అని ఆఫర్ల కోసం ఎదురుచూపులు చూడాల్సిన అంత అలా కూడా మారడం లేదు. క్రేజీ ఆఫర్లే ఈమెకు వస్తున్నాయి. ‘దూసుకెళ్తా’ ‘భలే భలే మగాడివోయ్’ ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘శ్రీరస్తూ శుభమస్తు’ వంటి హిట్ చిత్రాలలో నటించింది.

మధ్యలో ‘మిస్టర్’ ‘అంతరిక్షం’ ‘యుద్ధం శరణం’ ‘ఇంటిలిజెంట్’ వంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి.. అలా అని అవి చిన్న ఆఫర్లు కాదు. గతేడాది నిఖిల్ తో ‘అర్జున్ సురవరం’ సినిమా చేసి హిట్ అందుకుంది. ఇలా క్రేజీ ఆఫర్లతోనే ఈ అమ్మడు దూసుకుపోతుంది. మితిమీరిన గ్లామర్ షో చెయ్యదు. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటుంది. అందుకే ఈమెకు మంచి ఆఫర్లే వస్తున్నాయి.

ప్రస్తుతం ఈమె సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ లో హీరోయిన్ గా నటిస్తుంది. కార్తికేయకు జోడీగా కూడా ఓ సినిమా చేస్తుంది. ఇప్పుడు కింగ్ నాగార్జున సరసన మరో చిత్రం చేయడానికి రెడీ అవుతుంది. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మరోసారి లావణ్య నే … యంగ్ నాగార్జున పక్కన హీరోయిన్ గా ఎంచుకున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus