Pawan Kalyan: సాయి తేజ్ ప్రమాదంపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన పవన్!

  • July 26, 2023 / 06:22 PM IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం బ్రో. ఈ సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంగళవారం సాయంత్రం శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లి తిరిగి ప్రాణాలతో బయటపడిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తాను సాయి తేజ్ కిప్రమాదం జరిగినప్పుడు త్రివిక్రమ్ ఇంట్లో ఉన్నానని తెలిపారు. ఫోన్ రాగానే అటు నుంచి హాస్పిటల్ కి వెళ్లాను చిన్న ప్రమాదమే గంటలో బయటికి వస్తారని వెళ్ళాను.

అక్కడికి వెళ్తే పెద్ద పెద్ద డాక్టర్స్ అంత లోపలికి వెళ్తున్నారు చాలా హడావిడి చేస్తున్నారు ఏం జరుగుతుందో అర్థం కాలేదు కానీ సీరియస్ గా ఉందని మాత్రం డాక్టర్లు చెప్పారు. సాయి తేజ్ కుసీరియస్ గా ఉందని తెలియగానే తాను నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారని ఒక మూలన కూర్చొని నాలో నేనే కుమిలిపోయాను అని తెలిపారు.ఆ క్షణం నా ఇష్ట దేవతను ప్రార్థించాలని వాడికి చాలా భవిష్యత్తు ఉంది వాడిని బ్రతికించమని వేడుకున్నానని తెలిపారు.

భగవంతుడి దయవల్ల సాయితేజ్ ప్రమాదం నుంచి బయటపడ్డారు అయితే తనని కాపాడిన డాక్టర్లకు అంతకంటే ముందుగా తను రోడ్డుపై నిస్సహాయంగా పడి ఉంటే తనకు సహాయం చేసిన అబ్దుల్ కి తాను జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సందర్భంగా (Pawan Kalyan) పవన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus