Pawan Kalyan: పవన్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా.. ఏమైందంటే..?

  • April 11, 2021 / 04:06 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి డిజాస్టర్ తరువాత సినిమాలకు తాత్కాలికంగా దూరమైన పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఈ సినిమాకు శుక్ర, శనివారాలలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. వకీల్ సాబ్ సినిమా హిట్ కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన నివేదా థామస్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

ఈమెకు కరోనా నిర్ధారణ కావడంతో చిత్రయూనిట్ పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. పవన్ వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి కరోనా సోకడంతో ఆయన క్వారంటైన్ లోకి వెళ్లారని సమాచారం. సిబ్బందితో పవన్ చాలా దగ్గరగా ఉండటంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తిరుపతి ఉపఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకలాపాలను వర్చువల్ గా నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

జనసేన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారని సమాచారం. రేపు నాయుడుపేటలో బహిరంగ సభ జరగనుండగా ఈ సభకు పవన్ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. వైద్యుల సూచనల మేరకు పవన్ ప్రశాంత వాతావరణంలో గడుపుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్ తో పాటు క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. పవన్ క్వారంటైన్ లో ఉండటంతో ఈ సినిమాల షూటింగ్ లు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉంది.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus