Pawan Kalyan, Sujeeth: సినిమాలో 20 నిమిషాల పాటు పవన్ కనిపించడా.. ఏమైందంటే?

  • December 7, 2022 / 01:20 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిభ ఉన్న దర్శకులలో సుజీత్ ఒకరు. తన ప్రతిభతో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా అవార్డులను సొంతం చేసుకున్న సుజీత్ రన్ రాజా రన్ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రన్ రాజా రన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో పాటు సినిమాలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకున్నాయి.

రన్ రాజా రన్ సక్సెస్ తో సుజీత్ కు సాహో సినిమాకు పని చేసే అవకాశం దక్కింది. సాహో సినిమాను సుజీత్ బాగానే తెరకెక్కించినా హిందీ ప్రేక్షకులకు నచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. ఈ సినిమా వల్ల సుజీత్ పై భారీ స్థాయిలో విమర్శలు రావడంతో పాటు అవకాశాలు ఇచ్చే హీరోలు, నిర్మాతల సంఖ్య తగ్గింది. అయితే టాలెంట్ ను నమ్మి దర్శకులకు ఛాన్స్ ఇచ్చే పవన్ సుజీత్ కు కూడా ఛాన్స్ ఇచ్చారు.

పవన్ సుజీత్ దానయ్య కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ కావడంతో పాటు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారక ప్రకటన వచ్చేసింది. హరిహర వీరమల్లు షూట్ పూర్తైన వెంటనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. అయితే సినిమా మొదలైన 20 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ కనిపించరని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ తక్కువగానే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాకు పవన్ రెమ్యునరేషన్ మాత్రం 70 కోట్ల రూపాయలు అని సమాచారం. పవన్ సుజీత్ కాంబో మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుందో లేదో స్పష్టత రావాల్సి ఉంది. పవన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఏడాదికి ఒక మూవీ కచ్చితంగా రిలీజయ్యేలా పవన్ ప్లాన్ చేసుకుంటున్నారు. పవన్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండగా సినిమాల్లో, రాజకీయాల్లో సక్సెస్ ఫుల్ గా పవన్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus