అబ్బాయిలా ఉన్నానని దారుణంగా ట్రోల్ చేశారు!

  • March 10, 2021 / 03:06 PM IST

సెలబ్రిటీలు ట్రోలింగ్ కి గురి కావడం ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. దీపికా పదుకోన్, పూజా హెగ్డే, సమంత లాంటి స్టార్ హీరోయిన్లకు కూడా ఈ బాధలు తప్పలేదు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను కూడా దారుణంగా ట్రోల్ చేశారు. సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఈ బ్యూటీ. గతంలో చాలా సార్లు ట్రోలింగ్ బారిన పడినట్లు.. తన శరీరాన్ని అబ్బాయిల శరీరంతో పోలుస్తూ బాడీ షేమింగ్ చేసేవారని..

ఈ విషయాలు తనను తీవ్రంగా బాధించేవని చెప్పింది. అప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చానని.. ఆ సమయంలో తనను ఫ్లాట్ స్క్రీన్ అని పిలిచేవారని ఆవేదన వ్యక్తం చేసింది. తన బాడీ అచ్చం అబ్బాయిల బాడీలా ఉందంటూ విమర్శించిన విషయాలను గుర్తు చేసుకుంది. కెరీర్ లో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాల్సిన సమయంలో ఈ ట్రోల్స్ తనను మానసికంగా కుంగదీసేవని.. దీంతో మరింత బలహీనురాలిగా అయిపోయేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.

ఆ తరువాత ట్రోల్స్ ని సాధారణంగా చూడడం మొదలుపెట్టానని.. మొదట్లో అవి బాధించినా.. మెల్లగా ఎంజాయ్ చేయడం నేర్చుకున్నానని తెలిపింది. తనని తాను ప్రేమించుకోవడం మొదలుపెట్టానని.. అలాంటప్పుడు ఎలాంటి విమర్శలు బాధించవని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే బాలీవుడ్ లో షకున్ బత్రా దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయింది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus