Suriya: మళ్ళీ సూర్య పై నోరు పారేసుకున్న పొలిటీషియన్..!

  • November 15, 2021 / 10:00 PM IST

ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదలైన ‘జై భీమ్’ చిత్రంతో మరో హిట్టు అందుకున్నాడు హీరో సూర్య. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లాయర్ చంద్రు పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నాడు సూర్య. తెలుగు ప్రేక్షకులని కూడా ఈ చిత్రం అమితంగా ఆకట్టుకుంది. ఆదివాసీయులని వివక్షతో చూస్తుండడం… పోలీసులు వారిని చిత్ర హింసలు పెట్టడం వంటివి ఈ చిత్రంలో చూపించారు. ఈ విషయాలను కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు మెచ్చుకునే వారు ఎంతమంది ఉన్నారో విమర్శించే వారు కూడా అంతేవిధంగా ఉన్నారు.

‘జై భీమ్’ లో మతపరమైన చిహ్నాలు కలిగి ఉన్న సన్నివేశం ఉందని… ఓ వర్గం వారిని అవమానించేలా చాలా అభ్యంతర కరంగా ఆ సన్నివేశం ఉందని కొందరు నిరసనకి దిగారు.ఆ సన్నివేశాన్ని మేకర్స్ మార్చినప్పటికీ ఆ వివాదం ఆగడం లేదు. ఈ చిత్రం నిర్మాత, దర్శకుడి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి అయిన పన్నీర్‌ సెల్వం… స్థానిక పోలీసులకి వినతిపత్రం జారీ చేశారు.

అంతేకాదు కులపరమైన, మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టేలా చేసినందుకు హీరో సూర్యని మైలాడుతురై జిల్లాకు వాస్తవ్యులు మరియు యువకులు కనుక కొడితే పార్టీ తరపున లక్ష రూపాయల బహుమతి ఇస్తానని’ ప్రకటించాడు. ఈయన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus