భలే డిఫరెంట్ రోల్ ప్లే చేయనున్న పూజా హెగ్డే

  • June 27, 2018 / 11:38 AM IST

మహేష్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డెహ్రాడూన్ లో షెడ్యూల్ జరుపుకొంటున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ చిత్రంలో పూజా హెగ్డే పోషించనున్న పాత్రపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అయితే… విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ గేమ్ క్రియేటర్ గా నటించబోతోందని తెలుస్తోంది.

ఆల్రెడీ ఇదివరకు రకుల్ ప్రీత్ సింగ్ “బ్రూస్ లీ” సినిమాలో గేమ్ క్రియేటర్ గా నటించిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు పూజా అదే తరహా పాత్ర పోషించనుంది. మరీ మహేష్ బాబు మీద గేమ్ క్రియేషన్ లాంటిది చేయదు కానీ.. మంచి గేమర్ గా మాత్రం కనిపించనుందట. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ యూరప్ లో జరగనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus