బిగ్ బాస్ హౌస్ లో ప్లేట్లు, టాయిలెట్స్ కడగాలి…అది నేను చేయలేను

  • September 28, 2020 / 06:48 PM IST

తమిళ హీరోయిన్ లక్ష్మీ మీనన్ బిగ్ బాస్ షోపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.బిగ్ బాస్ రియాలిటీ షోని ఆమె ఓ చెత్త షో అంటూ విమర్శించింది. తమిళ బిగ్ బాస్ సీజన్ 4 కొద్దిరోజులలో మొదలుకానుండగా లక్ష్మీ మీనన్ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్ గా బిగ్ బాస్ తమిళ్ ఇప్పటి వరకు మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. అక్టోబర్ 4వ తేదీన బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా ప్రారంభం కానుంది.

షో మొదలుకావడానికి వారం రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే కంటెస్టెంట్స్ పై కథనాలు రావడం జరిగింది. హీరోయిన్ లక్ష్మీ మీనన్ కూడా బిగ్ బాస్ సీజన్ 4లో పార్టిసిపేట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీ మీనన్ పుకార్లకు వివరణ ఇచ్చారు. బిగ్ బాస్ ఒక చెత్త రియాలిటీ షో, ఒకరు తిన్న ప్లేట్లు మరొకరు కడగాలి, ఒకరు వాడిన టాయిలెట్స్ మరొకరు శుభ్రం చేయాలి. కెమెరా ముందు ఇంటి సభ్యులతో వివాదాలకు దిగాలి. అలాంటి పనులు నేను చేయలేను బిగ్ బాస్ షో పై నా అభిప్రాయం నేరుగా చెప్పాను.

ఇకపై నేను బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నాననే పుకార్లు రావని ఆశిస్తున్నా అన్నారు. లక్ష్మీ మీనన్ వ్యాఖ్యలకు కొందరు నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఆమె వ్యాఖ్యలు కొందరి మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజెన్స్ కామెంట్స్ కి లక్ష్మీ మీనన్, అది నా వ్యక్తిగత అభిప్రాయం…నేను తిన్న ప్లేటు, నా టాయిలెట్ నేను శుభ్రం చేసుకుంటాను అని వివరణ ఇచ్చారు. ఏదిఏమైనా లక్ష్మీ మీనన్ వ్యాఖ్యలు కోలీవుడ్ లో సరికొత్త వివాదానికి తెరలేపాయి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus