నిశ్చితార్ధం అయిన కొన్ని నెలలకే నటి సూసైడ్!

  • December 9, 2020 / 10:49 AM IST

ప్రముఖ తమిళ నటి వీజే చిత్ర(28) అనుమానాస్పద స్థితిలో మరణించారు. చెన్నైలో ఓ హోటల్ రూమ్ లో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తమిళ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చిత్ర ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ‘పాండియన్ స్టోర్స్’ అనే షోతో పాపులారిటీ సంపాదించుకున్న వీజే చిత్రకి కొద్దిరోజుల క్రితం వ్యాపారవేత్త హేమంత్ తో నిశ్చితార్ధం జరిగింది. అయితే హేమంత్ తో కలిసి ఉన్న హోటల్ గదిలోనే ఆమె ఆత్మహత్య చేసుకొని కనిపించింది.

బుధవారం ఉదయం స్నానం చేసి వస్తానని వెళ్లిన చిత్ర.. ఎంతసేపటికీ రాకపోవడంతో హేమంత్ హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో హోటల్ సిబ్బంది డూప్లికేట్ తాళంతో తలుపులు తెరవగా.. అప్పటికే గదిలో చిత్ర చీరతో ఉరేసుకొని కనిపించింది. చిన్న వయసులోనే చిత్ర ఆత్మహత్య చేసుకోవడంపై తమిళ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఏదొక విషయంలో తీవ్రంగా బాధ పడడం వలన ఆమె నిరాశతో సూసైడ్ చేసుకుందని చెబుతున్నారు.

ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పలు టీవీ సీరియల్స్ తో తన క్రేజ్ ని పెంచుకున్న చిత్రకు ‘చిన్న పాపా పెరియా పాపా’ అనే సీరియల్ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. దాదాపు నాలుగేళ్ల పాటు ప్రసారమైన ఈ సీరియల్ మంచి రేటింగ్స్ అందుకుంది. గతేడాది విజయ్ టీవీలో వచ్చిన ‘వసూల్ వెట్టై’కి చిత్ర హోస్ట్ గా వ్యవహరించారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus