Prabhas: విల్లు ఎక్కుపెట్టి రావణ దహనం చేసిన ప్రభాస్.. వైరల్ అవుతున్న వీడియో!

  • October 6, 2022 / 03:33 PM IST

ప్రతి ఏడాది దసరా పండుగ సందర్భంగా రామ్ లీలా మైదానంలో రావణ దహన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది ప్రముఖులు రామ్ లీలా మైదానంలోకి చేరుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా జరిపిస్తారు. ఇకపోతే గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణం వల్ల ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించలేకపోయారు. అయితే ఈ ఏడాది మాత్రం రావణ దహన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిపారని తెలుస్తోంది.

ఇకపోతే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ నటుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ హాజరయ్యారు. రామ్ లీలా మైదానం కమిటీ వారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రభాస్ విల్లు ఎక్కి పెట్టి రావణాసురుడిని దహనం చేశారు. ప్రభాస్ విల్లు ఎక్కి పెట్టి విడవగా రావణాసురుడు దహనం అయ్యారు. ప్రస్తుతం ఈ రావణ దహన కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే ప్రభాస్ తాజాగా ఆది పురుష సినిమాలో రాముడి పాత్రలో నటిస్తుండడంతో ఈ కార్యక్రమానికి ఈయన ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ అయోధ్యలోని సరియునది తీరాన విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే రామ్ లీలా మైదానంలో కూడా ఆది పురుష్ చిత్ర బృందం సందడి చేశారు.

సాధారణంగా ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. అయితే సౌత్ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఇప్పటివరకు ఏ హీరో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు అలాంటి ఘనత గౌరవం అందుకున్న మొదటి హీరో ప్రభాస్ అని చెప్పాలి. ఇలాంటి అరుదైన గౌరవం ప్రభాస్ కి దక్కినందుకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus