Prabhas: ప్రభాస్‌ ఫుడ్‌ అటాక్‌… కొత్త టార్గెట్‌ వాళ్లే…!

  • September 27, 2021 / 03:31 PM IST

రాజుల మర్యాదలు ఎలా ఉంటాయో మనలో చాలామందికి తెలుసు. టాలీవుడ్‌లో అయితే అలాంటి మర్యాదలు చేసే రాజుల్లో ప్రభాస్‌ కుటుంబం ఒకటి. ఆయన సినిమాల్లో నటించే సహ నటులకు ప్రభాస్‌ అతిథి మర్యాదలు బాగా చేస్తుంటారు. ఈ విషయాన్ని చాలామంది నాయికలు, కథానాయకులు చెప్పారు కూడా. కడుపు నిండా తిండి… ఇంకా చెప్పాలంటే ఓవర్‌ఫ్లో అయ్యే తిండి పెట్టడం ప్రభాస్‌ కుటుంబానికి అలవాటు. అలా ఫుడ్‌ అటాక్‌ చేస్తుంటారాయన. తాజాగా ప్రభాస్‌ ఫుడ్‌ అటాక్‌… బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ మీద పడింది.

బాలీవుడ్‌ కొత్త రావణుడు సైఫ్‌ అలీ ఖాన్‌… ప్రభాస్‌కు టార్గెట్‌ అయ్యాడు. సైఫ్‌, కరీనా కోసం ప్రభాస్‌ భీమవరం స్టైల్‌ ఫుడ్‌ చేయించి మరీ పంపించారట. దానిని ఓ పట్టుపట్టినట్లు కరీనా కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది. ‘‘బాహుబలే బిర్యానీ పంపిస్తే.. అది ది బెస్ట్‌ ఫుడ్ అనే చెప్పాలి. రుచికరమైన భోజనాన్ని పంపించినందుకు థ్యాంక్యూ ప్రభాస్‌’ అని కరీనా పోస్ట్‌ చేసింది. ప్రభాస్‌ ఫుడ్‌ అటాక్‌కు గతంలో చాలామంది బాధితులే.

డైట్‌ మారిపోతోందని కొందరు, ఇంత అభిమానం, మర్యాదలు తట్టుకోలేం అని ఇంకొందరు తమన ఆనందాన్ని… బ్రేవ్‌ మంటూ చెప్పేవారు. రీసెంట్‌ భాగ్యశ్రీకి ఇలాగే పూతరేకులు పంపించి సర్‌ప్రైజ్‌ చేశారు ప్రభాస్‌. ఇప్పుడు ‘ఆదిపురుష్‌’లోని రావణుడి వంతు వచ్చింది. ఇంకా ప్రభాస్‌ టార్గెట్‌లో ఎవరెవరు ఉన్నారో.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus