మహేష్ ను మించి మల్టీప్లెక్స్ నిర్మించబోతున్న ప్రభాస్..!

  • January 8, 2019 / 11:46 AM IST

తాజాగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో మహేష్ బాబు ‘ఏ.ఎం.బి సినిమాస్’ సూపర్ ప్లెక్స్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అది చాలా పాపులర్ అయ్యింది. చాలా వరకు కొత్త సినిమాలకు సంబందించిన వేడుకలను ఇందులో నిర్వహిస్తుండడం విశేషం. ఇక ఇందులో సినిమాలు చూసిన ప్రేక్షకులు, ఆ అనుభూతి అద్భుతం అని చెబుతుండడం విశేషం. ఇక ఇలాంటి సూపర్ ప్లెక్స్ లను నిర్మించే ఆలోచనలో సురేష్ బాబు .. అల్లు అరవింద్ .. దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతలు లైన్లో ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ జాబితాలోకి ప్రభాస్ కూడా చేరబోతున్నట్టు సమాచారం.

ప్రభాస్ కూడా మల్టీ ప్లెక్స్ ల నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నాడని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం. నెల్లూరు జిల్లాకు చెందిన సూళ్ళూరుపేట దగ్గర, చెన్నై – కోల్ కతా హై వే పక్కన ‘పిండిపాళెం’ దగ్గర ఆయన ఈ మాల్ ను నిర్మించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇక ఒక్కో స్క్రీన్లో 170 సిట్టింగ్ తో .. మొత్తం 670 సీట్ల సిట్టింగ్ కలిగిన స్క్రీన్లతో ఈ మాల్ ఉండబోతుందట. సుమారు ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో .. 106 అడుగుల వెడల్పు తెరతో ఈ మల్టీ ప్లెక్స్ నిర్మించేందుకు ప్లాన్ సిద్దమయ్యిందట. ఆసియాలోనే ఇది రెండవ అతిపెద్ద మల్టీ ప్లెక్స్ అని తెలుస్తుంది. ఏదేమైనా.. ప్రభాస్ కూడా మహేష్ ను మించి మల్టీ ప్లెక్స్ నిర్మించబోతుండడం గమనించతగ్గ విషయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus