జోరందుకున్న ప్రభాస్ నెక్స్ట్ సినిమా పనులు

  • February 8, 2018 / 07:26 AM IST

బాహుబలి 2 తర్వాత యంగ్ రెబల్ స్టార్ ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ స్టడీగా సాగుతోంది. ఈ చిత్రం రిలీజ్ ఆలస్యం అవుతుందని ఉద్దేశంతో.. అభిమానులకోసం మరో సినిమాని కంప్లీట్ చేయాలనీ ప్రభాస్ చూస్తున్నారు. అందుకే తర్వాత సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపి కృష్ణ ఫిలిమ్స్ బ్యానర్లో కృష్ణం రాజు నిర్మించనున్న ఆ సినిమాని జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ టెక్నీషియన్లు, ఆర్టిస్టులను ఫైనల్ చేస్తున్నారు.

ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం. ఈయన గతంలో ‘దేవ్ డి, ఇష్క్ జ్యాదా, క్వీన్, హైవే, లూటేరా’ వంటి సినిమాలకు సంగీతం ఇచ్చారు. ప్రభాస్ 20 వ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నారు. అలాగే తాజాగా హీరోయిన్ ఫిక్స్ అయినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. డీజే సినిమా ద్వారా పరిశ్రమ దృష్టిలో పడ్డ పూజా హెగ్డేని ప్రభాస్ కి జోడీగా తీసుకున్నట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus