Prabhas: కృష్ణంరాజు విగ్రహం చేయిస్తున్న ప్రభాస్.. ఏమైందంటే?

  • September 21, 2022 / 11:33 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఆయనను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా అంచనాలకు మించి ఉంది. పెదనాన్న కృష్ణంరాజు మరణించడంతో ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్ లకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి ప్రభాస్ షూటింగ్ లలో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. కృష్ణంరాజు మరణం నేపథ్యంలో కుటుంబ బాధ్యతలన్నీ ప్రభాస్ పై పడ్డాయి. అయితే కృష్ణంరాజు కోసం ప్రభాస్ ఈ నెల 29వ తేదీన బ్రహ్మాండమైన సంస్మరణ సభను ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

ఈ సంస్మరణ సభ సమయం పెదనాన్న కృష్ణంరాజు, తండ్రి సూర్యనారాయణ రాజు విగ్రహాలను ప్రతిష్టించాలని ప్రభాస్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ సంస్మరణ సభకు హాజరయ్యే వాళ్లకు ప్రభాస్ భోజనాలు ఏర్పాటు చేయిస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ సంస్మరణ సభకు ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానం అందనుందని బోగట్టా. పెద్దఎత్తున సభను నిర్వహించి కృష్ణంరాజు ఆత్మకు శాంతి కలిగేలా చేయాలని ప్రభాస్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన ప్రభాస్ మొగల్తూరుకు వెళ్లనున్నారని సమాచారం అందుతోంది.

ఏకంగా 70వేల మంది కోసం ఇక్కడ భోజనం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్ నటించిన రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. ఆదిపురుష్ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుండగా సలార్ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సినిమాసినిమాకు ప్రభాస్ రేంజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న ప్రభాస్ సినిమాలకు ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus