Prabhas: ప్రభాస్ మాట మీద నిలబడతారా?

  • August 3, 2021 / 11:23 AM IST

స్టార్ హీరో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయా..? అనే ప్రశ్నకు ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న రాధేశ్యామ్ 2022 జనవరి 14వ తేదీన రిలీజ్ కానుండగా సలార్ మూవీ ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ కానుంది. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ 2022 సంవత్సరం ఆగష్టు 11వ తేదీన రిలీజ్ కానుండటం గమనార్హం. ప్రభాస్ కేవలం ఏడు నెలల్లోనే మూడు సినిమాలను రిలీజ్ చేస్తారా..?

లేదా..? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కాగా ఈ మూడు సినిమాల బడ్జెట్ ఏకంగా 1,000 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ప్రభాస్ అభిమానులు ఈ మూడు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత రిలీజైన సాహో ప్రభాస్ అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. 2020, 2021 సంవత్సరాల్లో ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.

రాధేశ్యామ్ ఈ ఏడాదే రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ మారింది. ముచ్చటగా మూడు సినిమాలతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందించటానికి సిద్ధమవుతున్న ప్రభాస్ ఈ సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కె అనే సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 200 రోజులు డేట్లు ఇచ్చారని తెలుస్తోంది. ప్రభాస్ రిలీజ్ డేట్ల విషయంలో మాట మీద నిలబడతారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus