Priyamani: ఆ ట్రోల్స్ వల్ల ఇబ్బందులు.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • April 16, 2024 / 11:15 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన ప్రియమణికి (Priyamani)  ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రియమణి వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా స్టార్స్ ప్రాజెక్ట్ లలో ఆఫర్లు వస్తే ఆమె రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే తాజాగా ప్రియమణి ఒక సందర్భంలో పెళ్లి సమయంలో ఎదురైన ట్రోల్స్ గురించి స్పందిస్తూ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వల్ల తల్లీదండ్రులు ఇబ్బందులు పడ్డారని ఆమె చెప్పుకొచ్చారు.

మైదాన్ (Maidaan) సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియమణి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వల్ల నాతో పాటు నా ఫ్యామిలీని కూడా ట్రోల్ చేశారని ఆమె తెలిపారు. ఆ ట్రోల్స్ వల్ల నా పేరెంట్స్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని ప్రియమణి వెల్లడించారు. ఆ సమయంలో నా భర్త మాకు అండగా నిలబడ్డాడని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఏం జరిగినా సరే నేను చూసుకుంటానని నా భర్త భరోసా ఇచ్చాడని ప్రియమణి వెల్లడించారు.

ఇలాంటి అర్థం చేసుకునే భర్త ఉండటం నిజంగా నా అదృష్టం అని ఆమె పేర్కొన్నారు. నా భర్తకు పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసని ప్రియమణి కామెంట్లు చేశారు. ప్రియమణి చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 2017 సంవత్సరంలో ప్రియమణి ముస్తఫారాజ్ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఈ జోడీ అన్యోన్యంగా ఉన్నారు. ప్రియమణి పెళ్లి తర్వాత కూడా వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఎక్కువ సంఖ్యలో వెబ్ సిరీస్ లలో సైతం నటిస్తున్న ప్రియమణి మరికొన్ని సంవత్సరాల పాటు విజయవంతంగా కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ అయితే ఉంది. ప్రియమణి 39 సంవత్సరాల వయస్సులో సైతం వరుస ఆఫర్లను సొంతం చేసుకున్నారంటే గ్రేట్ అనే చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus