ప్రియాంక చోప్రాపై నెటిజన్లు ఫైర్!

  • January 8, 2021 / 08:19 PM IST

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఓ వివాదంలో చిక్కుకుంది. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రియాంక చోప్రా లండన్ లో ఓ సెలూన్ ని సందర్శించడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. యూకేలో కొత్తరకం కరోనావిజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో లండన్ ప్రభుత్వం అక్కడ లాక్ డౌన్ ని అమలు చేస్తోంది. ఇదిలా ఉండగా.. షూటింగ్ లో భాగంగా లండన్ కు వెళ్లిన ప్రియాంక చోప్రా గతవారం తన తల్లితో కలిసి సెలబ్రిటీ స్టైలిష్ జోష్ వుడ్ కు సంబంధించిన ప్రైవేట్ సెలూన్ కు వెళ్లింది. దీంతో అది చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

వెంటనే అక్కడకి చేరుకున్న పోలీసులు ప్రియాంకను హెచ్చరించారు. అంతేకాకుండా ప్రభుత్వ రూల్స్ కి వ్యతిరేకంగా సెలూన్ ని ఓపెన్ చేసిన జోష్ వుడ్ ను గట్టిగా వారించారు. అయితే వీరికి ఎలాంటి జరిమానా విధించలేదు. షూటింగ్ లో భాగంగా తన జుట్టుకి రంగు వేసుకోవాల్సి ఉందని.. అందుకే సెలూన్ కు వచ్చినట్లు ప్రియాంక పోలీసులకు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ప్రియాంకపై మండిపడుతున్నారు. రూల్స్ ని పక్కన పెట్టి జుట్టుకి కలర్ వేసుకోవడం ముఖ్యమా అంటూ ఆమెని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక ‘టెక్స్ట్ ఫర్ యూ’ అనే సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. కొన్ని మార్గదర్శకాలను అనుసరిస్తూ టీవీ, మూవీ షూటింగ్‌లకు అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రియాంకా సినిమా షూటింగ్ కి కూడా పర్మిషన్ దొరకడంతో చిత్ర యూనిట్‌ ఇటీవల అక్కడకు చేరుకుంది. రూల్స్ ప్రకారం కోవిడ్ టెస్ట్ లు చేయించుకొని క్వారెంటైన్ లో ఉన్నారు. క్వారెంటైన్ పూర్తి కావడంతో ప్రియాంక తన హెయిర్ కి కలర్ వేయించుకోవడం కోసం బయటకొచ్చి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus