అజ్ఞాతవాసి డిస్ట్రిబ్యూటర్స్ ని భయపెడుతున్న రన్ టైమ్!

  • December 20, 2017 / 12:33 PM IST

పవన్ కళ్యాణ్ అభిమానులకు సంక్రాంతిని ముందుగా తెచ్చే మూవీ అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తుది మెరుగులు దిద్దుకుంటోంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్యానుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కీలక పాత్రలో అలనాటి హీరోయిన్ కుష్బూ కనిపించనుంది. ఆమె తో పవన్ కళ్యాణ్ కి మధ్య కొన్ని ఎమోషల్ సీన్స్ ఉన్నాయంట. ఇదే మహిళా ప్రేక్షకులను థియేటర్ కి రప్పిస్తుందని త్రివిక్రమ్ గట్టిగా నమ్ముతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అవసరమైన ఫైట్స్ కూడా ఉన్నాయి. ఇలా అన్ని అంశాలను సమకూర్చడం వల్ల  సినిమా రన్ టైమ్ దాదాపు 2 గంటల 45 నిమిషాల నిడివి వచ్చినట్లు సమాచారం.

ఇంత ఎక్కువగా ఉంటే ఎక్కువ షోస్ వేసుకోవడం కష్టమవుతుందని, తగ్గించమని  డిస్ట్రిబ్యూటర్స్  కోరుతున్నారు. అయినా త్రివిక్రమ్ మాత్రం ఏ సీన్ కి కట్ చెప్పడానికి ఇష్టపడడం లేదు. ఈ విషయంపై చివరికి డైరక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు గానీ.. అజ్ఞాతవాస్ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. అతి తక్కువ సమయంలో ఎక్కువమంది చూసిన టీజర్ గా రికార్డ్ బద్దలు కొట్టింది. నిన్న విడుదలైన పూర్తి పాటలు అభిమానులకు తెగ నచ్చేసాయి. ఇవి కూడా రికార్డ్స్ క్రియెట్స్ చేస్తుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 10 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus