ప్రొడ్యూసర్ తీసుకున్న నిర్ణయానికి ఆశ్చర్యపోయిన తమన్నా

  • April 25, 2018 / 12:31 PM IST

బాహుబలి సినిమాతో మిల్కీ బ్యూటీ తమన్నా దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ సంపాదించుకుంది. వచ్చిన ఆఫర్లన్నిటికి ఓకే చెప్పకుండా… సెలెక్టెడ్ సినిమాలను చేస్తోంది. బాలీవుడ్ లో కంగనా రనౌత్ చేసిన క్వీన్ ని దక్షిణాది అన్ని భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ లో క్వీన్ గా తమన్నా నటిస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న “నా నువ్వే” సినిమాలోను హీరోయిన్ గా చేస్తోంది. ఈ రెండు సినిమాల కంటే ముందే బాలీవుడ్ లో కామోషి అనే సినిమాను మొదలుపెట్టింది. ఇందులో తమన్నా, ప్రభుదేవా కీలక రోల్లో కనిపించనున్నారు. దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్ర రష్ ని చూసిన నిర్మాత వాసుహ్ భగ్నానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తీసిన సినిమాని మొత్తం చెత్తలో పడేయమన్నారంట. డైరక్టర్ చక్రి తోలేటి మొదట షాక్ తిన్నారు.

నిజమో కాదో అని మళ్ళీ నిర్మాతను అడిగారు. తనకు ఈ సీన్స్ నచ్చలేదని, రీ షూట్ చేయమని ఆర్డర్ వేసినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. డైరక్టర్ నుంచి ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న తమన్నా షాక్ కి గురైంది. మళ్ళీ సినిమా మొత్తం తీయాలంటే ఎన్ని డేట్స్ కేటాయించాలోనని తలపట్టుకుంది. ఇప్పుడు తాను సైన్ చేసిన సినిమా డేట్స్ ఇబ్బందిలో పడనుంది. కామోషికి డేట్స్ ఇస్తుందా? లేకుంటే సినిమా వదులుకుంటుందా? అనేది త్వరలో తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus