Raj Tarun: రాజ్‌ తరుణ్‌ వీడియో బైట్‌ పంపుతా అన్నాడు.. కానీ: నిర్మాత ఏం చెప్పారంటే?

  • July 24, 2024 / 02:06 PM IST

కాంట్రవర్శీలు సినిమాలకు ఎంతగా ఉపయోగపడతాయి అనేది తెలియాలంటే టాలీవుడ్‌లో కొంతమంది హీరోలను అడిగితే అర్థమవుతుంది. అలాంటి పేర్లు ఠక్కున గుర్తురాకపోతే విజయ్‌ దేవరకొండ, విశ్వక్‌సేన్‌ సినిమాల పేర్లు గుర్తు చేసుకొండి. ఆ విషయం పక్కనపెట్టండి వాళ్ల తరహా కాంట్రవర్శీ కాదు కానీ.. ఇంకో రకం పర్సనల్‌ కాంట్రవర్శీతో మీడియాలో, సోషల్‌ మీడియాలో నిత్యం నానుతున్న హీరో పేరు రాజ్‌ తరుణ్‌ (Raj Tarun) . విషయం ఏంటి అనేది మీకు తెలుసు కూడా. రాజ్‌తరుణ్‌ హీరోగా రామ్‌ భీమన ‘పురుషోత్తముడు’ అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే.

ఈ నెల 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ క్రమంలో రాజ్‌ తరుణ్‌ గురించి, ఆయన ఇష్యూ గురించి ప్రస్తావన వచ్చింది. దానికి చిత్రబృందం రిప్లై కూడా ఇచ్చింది. రాజ్‌ తరుణ్‌ వల్ల ‘పురుషోత్తముడు’ సినిమా బిజినెస్ లాస్‌ అయిందా? అని మీడియా అడిగితే నిర్మాత రమేశ్‌ సమధానం ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆలోచిస్తారు.

సినిమా కంటెంట్‌, యాక్టర్ల నటన చూస్తారు మాత్రమే. ఒక సినిమా వెనక రెండు వేల మంది కష్టపడి పనిచేస్తారు అని కూడా ఆడియన్స్‌కు తెలుసు. అంతేకాదు బిజినెస్‌, సినిమా ఫలితం విషయంలో ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు అని చెప్పారు. సినిమా క్వాలిటీపై ఫలితం, బిజినెస్‌ ఆధారపడి ఉంటాయి. తన వ్యక్తిగత విషయాల కారణంగా రాజ్‌తరుణ్‌ బిజీగా ఉన్నాడు. సినిమా గురించి ప్రచార కార్యక్రమాలు భారీగా ప్లాన్‌ చేశాం.

‘పురుషోత్తముడు’ టీజర్‌, ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది అని చెప్పారు. ఇక దర్శకుడు రామ్‌ భీమన.. రాజ్‌ తరుణ్‌ వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఈవెంట్‌కు రాలేదు. అయితే వీడియో బైట్‌ పంపుతాను అని చెప్పారు. కొన్ని రోజులుగా ఫోన్‌ అందుబాటులో లేకపోవడం వల్ల వీడియో బైట్‌ పంపలేకపోయారు అని చెప్పారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus