రాజ్ తరుణ్ తో ఎఫైర్ వార్తలు.. ఆ హీరోయిన్ కి బాగా కలిసొచ్చినట్టేగా..!

  • July 8, 2024 / 01:16 PM IST

రాజ్ తరుణ్ (Raj Tarun).. ‘నన్ను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి పూర్తిగా వాడుకుని..మోసం చేశాడు. ఇప్పుడు మరో హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నాడు’ అంటూ లావణ్య అనే యువతి నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘తిరగబడరాసామి’ అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న మాల్వీ మల్హోత్రాతో.. అతను ఎఫైర్ నడుపుతున్నట్టు సంచలన ఆరోపణలు చేస్తూ.. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను బయటపెట్టింది.

అయితే ‘ఆ ఫోటోలు ‘తిరగబడరాసామి’ సినిమా షూటింగ్ టైంలో..తీసుకున్నవని, మాల్వీ మల్హోత్రా తనకు ఫ్రెండ్ మాత్రమే అని’ రాజ్ తరుణ్ మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు లావణ్యతో ప్రేమాయణం నడిపిన మాట నిజమే అని, కానీ తర్వాత బ్రేకప్ చెప్పుకుని ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నట్టు.. అతను జెన్యూన్ గానే చెప్పాడు. ఆ తర్వాత లావణ్యని సాక్ష్యాలు ప్రవేశపెట్టాలని పోలీసులు డిమాండ్ చేస్తే ఆమె సైడ్ పోయింది. దీంతో ఇది ఆమె కావాలని చేసిన రచ్చ అని తేలింది.

మొత్తానికి ఈ గొడవ వల్ల.. ఎవరికైనా కలిసొచ్చిందా అంటే అది హీరోయిన్ మాల్వి మల్హోత్రా వల్లే అని చెప్పాలి. ఆమె కూడా ఈ వివాదంపై మీడియాలో మాట్లాడటం వల్ల ఆమె గురించి గూగుల్ లో సెర్చింగ్..లు జరిగాయి. ఈమె హిమాచల్ ప్రదేశ్ కి చెందిన అమ్మాయి అని, ఓ థియేటర్ ఆర్టిస్ట్ అని.. మెల్లమెల్లగా ప్రేక్షకులు తెలుసుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus