నాగ్ తో రెండో సినిమాకి సిద్ధమైన రాజ్ తరుణ్

  • November 23, 2016 / 11:22 AM IST

నాగార్జున తనకు సరిపడా కథలను ఎంపిక చేసుకుంటూ కెమెరా ముందు నటిస్తూనే యువ తరాన్ని ప్రోత్సహించేందుకు తెరవెనుక నిర్మాణ భాద్యతలను చేపడుతుంటారు. నూతన ప్రతిభావంతులకు బాసటగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగ్ పలు చిత్రాలు నిర్మించన సంగతి తెలిసిందే. అదేకోవలో రాజ్ తరుణ్ హీరోగా నాగ్ ఓ సినిమా నిర్మించనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

లఘు చిత్రాల అనుభవంతో విరించి వర్మ దర్శకుడిగా రూపొందిన ‘ఉయ్యాలా జంపాల’ సినిమాకి సహాయ దర్శకుడిగా చేరిన రాజ్ తరుణ్ అనూహ్యంగా అదే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తీరు విధితమే. ఈ సినిమాని పి.రామ్మోహన్ నిర్మించగా నాగార్జున సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఫలితంతో నటుడిగానే కొనసాగాలని నిశ్చయించుకున్న రాజ్ తరుణ్ తనకి వచ్చిన వాటిలో నచ్చిన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇన్నాళ్లకు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రాజ్ తరుణ్ ఓ సినిమా చేయనున్నాడట. ఈ సినిమాతో రంజని అనే మహిళా దర్శకులరాలు తొలిసారి మెగాఫోన్ పట్టనుందిట. కథ చర్చలు పూర్తైన ఈ సినిమా డిసెంబర్ ఒకటిన పూజా కార్యక్రమాలతో ప్రారంభమవనున్నట్టు భోగట్టా.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus