రజినీ కారణంగా దూరంగా ఉంటోన్న ప్రేమ జంట!

  • December 23, 2020 / 06:53 PM IST

దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార కొంతకాలంగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం నడిపిస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ప్రేమ.. పెళ్లి వరకు ఎప్పటికి వెళ్తుందో చెప్పలేని పరిస్థితి. కానీ వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఫారెన్ ట్రిప్ లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఈ జంటకి ఇప్పుడు ఎడబాటు తప్పడం లేదని తెలుస్తోంది. ఇద్దరూ ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ.. వేర్వేరుగా ఉండాల్సిన పరిస్థితి కలుగుతోంది.

దీనికి కారణం రజినీకాంత్ సినిమా అని తెలుస్తోంది. సినిమా షూటింగ్ ల నిమిత్తం నయనతార, విఘ్నేష్ జంట ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. రజినీకాంత్ తో కలిసి నయన్ ‘అన్నాత్తే’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం నయన్ హైదరాబాద్ కి వచ్చింది. ఇదే సమయంలో నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ తను దర్శకత్వం వహిస్తోన్న ‘వాకుల రెండు కదల్’ అనే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చారు.

కరోనా కారణంగా షూటింగ్ లు ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ స్పాట్ లోకి బయట వారెవరినీ అనుమతించడం లేదు. ఈ రూల్స్ ని చిత్రబృందం కఠినంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఒకేచోట ఉన్నప్పటికీ నయన్, విఘ్నేష్ వేర్వేరుగా ఉండక తప్పడం లేదు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus