అత్యాధునికంగా చరణ్, ఉపాసన ఇల్లు రెడీ

  • February 23, 2017 / 12:45 PM IST

ప్రముఖ వ్యాపార వేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలు అయిన ఉపాసన తన చిన్ననాటి ఫ్రెండ్ రామ్ చరణ్ ని ప్రేమించి 2012 లో పెళ్లిచేసుకుంది. తన భర్తకి అపురూపకానుకను ఇవ్వడానికి సిద్ధమైంది. అందుకే  హైదరాబాద్ లో అత్యాధునిక ఇంటిని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ జంట మెగా స్టార్ చిరంజీవి ఇంటిలోనే ఉంటున్నారు. ఎప్పటి నుంచో వేరే ఇంటికి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. కొత్త ఇంటిలోకి వెళ్లిన తర్వాతే పిల్లల గురించి ఆలోచిస్తామని ఉపాసన ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. ఆ ఇల్లు దాదాపు పూర్తి కావచ్చింది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఆ ఇంటిని రీసెంట్ గా కొంతమంది చూసి వచ్చారు.

వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం… “సకల సౌకర్యాలతో విశాలంగా నిర్మించారు. ఫ్లోర్ మొత్తం జర్మనీ టైల్స్ తో మెరిసిపోతోంది. హాల్, గదుల్లో ఉంచిన ఫర్నిచర్ ఇటలీ నుంచి తెప్పించారు. భవనం ఆవరణలో టెన్నిస్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. టోటల్ గా ఈ ఇల్లు లేటెస్ట్ రాజ్ మహల్ గా ఉంది” అని చెబుతున్నారు. ఈ ఇంటికోసం మొత్తం ఇప్పటికే 80 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని ఇందులోని చరణ్ దంపతులు అడుగుపెట్టనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus