ఉపాసన ఫోన్ ని ఎందుకు చెక్ చేస్తారో చెప్పిన రామ్ చరణ్.!

  • May 11, 2018 / 01:14 PM IST

రామ్ చరణ్, ఉపాసన భార్య భర్తలు అయినప్పటికీ.. ఎవరి స్పేస్ వారికీ ఉంటుంది. ఒకరి అనుమతి లేకుండా మరొకరి ఫోన్ కూడా టచ్ చేయరు. కానీ రామ్ చరణ్ తన భార్య ఫోన్ ని చెక్ చేస్తారంటా. అనుమానంతో కాదు.. మరి ఎందుకో మీరే అతని మాటల్లోనే తెలుసుకోండి. ” అప్పుడప్పుడు మా ఆవిడ ఫోన్ చెక్ చేస్తుంటా. ఆమె ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ను నేను ఓపెన్ చేస్తాను. ఆమె పెట్టిన పోస్టులు చూస్తుంటాను. నాకు సంబంధించిన కామెంట్స్ ఏమైనా ఉంటే చదువుతాను. అలా సోషల్ మీడియాలో నా ఫ్యాన్స్ ఫీలింగ్స్ తెలుసుకునేందుకు ఫోన్ చెక్ చేస్తా” అని వివరించారు.

ఈ మధ్య ప్రతి మాటను మీడియా వక్రీకరిస్తుండడంతో చరణ్ సోషల్ మీడియా నుంచి దూరంగా ఉన్నారు. అయినా ఫ్యాన్స్ అభిప్రాయాలూ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఇలా చూస్తుంటానని వెల్లడించారు. “సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే చాలా సంఘటనలపై  స్పందించాలి. స్పందిస్తే మరుసటి రోజు ఏం జరుగుతుందో తెలీదు. స్పందించకపోతే స్పందించలేదంటారు. ఇవన్నీ అవసరమా అనిపించింది. అందుకే సోషల్ మీడియా నుంచి తప్పుకున్నాను.” అని చెర్రీ వివరణ ఇచ్చారు. రామ్ చరణ్, సుకుమార్ కలయికలో వచ్చిన రంగస్థలం 200 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. ఈ చిత్రం అందించిన విజయఉత్సాహంతో బోయాపాటి దర్శకత్వంలో చరణ్ యాక్షన్ మూవీ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus