Ram Charan, Shankar: చరణ్ వాళ్లను టార్గెట్ చేయబోతున్నారా?

  • September 17, 2021 / 12:24 PM IST

చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే కియారా అద్వానీ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా కథకు సంబంధించి గతంలో ఎన్నో వార్తలు వైరల్ కాగా తాజాగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వార్త ప్రకారం మన దేశ చట్టాలను అడ్డు పెట్టుకుని కార్పొరేట్ వ్యవస్థలు ఏ విధంగా ఎదుగుతున్నాయో దర్శకుడు ఈ సినిమాలో చూపించనున్నారు. కార్పొరేట్ వ్యవస్థల వల్ల సామాన్యులు ఏ విధంగా నష్టపోతున్నారనే విషయాన్ని కూడా శంకర్ ఈ సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది. చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తారని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా తక్కువ సమయంలో ట్యూన్లు ఇస్తాడనే కారణంతో శంకర్ థమన్ కు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.

దాదాపుగా 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా దిల్ రాజు ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చరణ్ కియారా కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ ఫ్లాప్ కాగా ఈ సినిమా సక్సెస్ సాదిస్తుందేమో చూడాల్సి ఉంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus