త్రినాథరావు దర్శకత్వంలో సినిమా చేయనున్న రామ్ చరణ్

  • July 19, 2017 / 01:17 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమా చేస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ లో  వేసిన విలేజీ సెట్ లో మూడో షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్ గ్యాప్ లో కొత్త కథకు రామ్ చరణ్ ఒకే చెప్పినట్లు తెలిసింది. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ సినిమాల్తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన రీసెంట్ గా చెర్రీకి కథ చెప్పారంట. స్టోరీ చరణ్ కి బాగా నచ్చిందంట.

అయితే  కొన్ని మార్పులు చెప్పి సినిమా చేస్తానని మాట ఇచ్చారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. చెర్రీ చెప్పిన హంగులు జోడించి కథను సిద్ధం చేసే పనిలో త్రినాథరావు బిజీ అయినట్లు సమాచారం. రామ్ చరణ్ రంగస్థలం 1985 చిత్రాన్ని కంప్లీట్ అయిన వెంటనే హ్యాట్రిక్ డైరక్టర్ కొరటాల శివతో మూవీ చేయనున్నారు. దీనిని చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించనున్నారు. ఈ మూవీ తర్వాత  త్రినాథరావు ప్రాజక్ట్ పట్టాలెక్కనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus