రేపు ఏపీ లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్.. సాధ్యమేనా..?

  • April 30, 2019 / 01:45 PM IST

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఒక్క ఏపీ లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో విడుదలయ్యి సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే రాంగోపాల్ వర్మ మెయిన్ టార్గెట్ మాత్రం ఏపీ నే..! ఈ చిత్రాన్ని ఏపీ ప్రజలకి చూపించి చంద్రబాబు.. తన మామగారు ఎన్టీఆర్ ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడు అనేది ప్రచారం చేయాలనేది వర్మ ఆరాటం. దీంతో ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని మే1(రేపు) విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు.

అయితే ఎన్నికల సంఘం అనుమతి లేకుండానే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వారు రెడీ అవుతుండడం గమనార్హం. ఈ క్రమంలో, సినిమా విడుదలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి చిత్రాలు విడుదల చేయవద్దని ఏప్రిల్ 10న ఈసీ ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికల పై ప్రభావం చూపే బయోపిక్ లను ప్రదర్శించరాదని ఈ ఆదేశాల్లో ఉంది. అయితే వారి ఆదేశాలను సవరిస్తూ ఈసీ మరో ఉత్తర్వును విడుదల చేయలేదు.ఇలాంటి పరిస్థితుల్లో.. అందులోనూ మే 23 వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈ చిత్రాన్ని విడుదల చేయడం కుదరదు. మరి ఈ చిత్రం రేపు ఏపీలో విడుదలవుతుందా లేక మళ్ళీ వర్మ అందరినీ బకరాల్ని చేస్తాడా అనేది చూడాలి మరి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus