Rashmika:ఆ సినిమా ఎంతో స్పెషల్… రష్మిక పోస్ట్ వైరల్!

  • July 29, 2023 / 10:46 AM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలలో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక ప్రస్తుత వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా రష్మిక చేసే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతాయి.

ఈ క్రమంలోనే ఈమె తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి దిగిన ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనతో కలిసిన ఓ సినిమా తనకు ఎప్పుడు స్పెషల్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్లో మొదటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గీతాగోవిందం ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరికీ అభిమానులు కూడా భారీ స్థాయిలో పెరిగిపోయారు.

ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో డైరెక్టర్ భరత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ సినిమా పెద్దగా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినాప్పటికీ రష్మిక విజయ్ దేవరకొండ క్రేజ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది.ఇక ఈ సినిమా సక్సెస్ కాకపోయినప్పటికీ తాజాగా రష్మిక ఈ సినిమా తనకు ఎంతో స్పెషల్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశారు. ఈ సినిమా జూలై 26వ తేదీకి విడుదల అయ్యి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ఈ క్రమంలోనే రష్మిక (Rashmika) ఈ సినిమాఎప్పటికీ నాకు ప్రత్యేకమే ఈ మూవీ విడుదలయ్యి నాలుగేళ్లు పూర్తి అయింది థాంక్యూ భరత్ విజయ్ అంటూ ఈమె ఈ సినిమా డైరెక్టర్ భరత్ నటుడు విజయ్ దేవరకొండతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో కొందరు ఫ్లాప్ అయిన సినిమా ఎప్పటికీ స్పెషల్ అంటూ పోస్ట్ చేయడం ఏంటి రష్మిక అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus