అల్లు అర్జున్ ను కాదని మహేష్ కి ఓకే చెప్పిన ‘గీత గోవిందం’ బ్యూటీ..!

  • March 7, 2019 / 05:44 PM IST

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతూ ‘గోల్డెన్ లెగ్’ గా మారిపోయింది రష్మిక మందన. మొదటి చిత్రం ‘ఛలో’ తోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ ‘గీత గోవిందం’ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక క్రేజీ ముల్టీస్టారర్ ‘దేవదాస్’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడి పై స్టార్ హీరోలు, స్టార్ దర్శకుల దృష్టి పడింది. ఇప్పుడు రష్మిక చేతిలో చాలా ఆఫర్లు ఉన్నాయట.

అలా అని తొందర పడకుండా…. కథలను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట. కథలో తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఒప్పుకోవట్లేదట. అసలు మ్యాటర్ ఏంటంటే… ఇటీవల త్రివిక్రమ్ – బన్నీ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రం కోసం హీరోయిన్ గా రష్మిక ను సంప్రదించారట. అయితే తన పాత్ర నచ్చలేదని… మొహమాటం లేకుండా చెప్పేసి రిజెక్ట్ చేసిందట ఈ బ్యూటీ. ఈ విషయం పక్కన పెడితే… సూపర్ స్టార్ మహేష్ బాబుతో రష్మిక నటించడానికి రెడీ అవుతుందట. ప్రస్తుతం మహేష్ ‘మహర్షి’ చిత్రంతో బిజీగా ఉన్నమహేష్… తన తరువాతి సినిమాని అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయబోతున్నాడని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సూపర్ స్టార్ ప్రయత్నాలు మొదలుపెట్టాడట. ఇందులో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడి… రష్మిక కు స్క్రిప్ట్ ను వినిపించినట్లు సమాచారం. కథ నచ్చడం… అలాగే తన పాత్ర కూడా నచ్చడంతో రష్మిక ఒకే చెప్పేసిందట. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus