రష్మిక పై దిల్ రాజు ఫోకస్..!

  • March 16, 2019 / 03:06 PM IST

‘ఛలో’ ‘గీత గోవిందం’ భామ రష్మిక మందన వరుస హిట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఒకే ఏడాది వరుస విజయాలు సాధించి పెద్ద నిర్మాతల దృష్టిలో పడింది. ఇక తాజాగా మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో రష్మికని తీసుకోబోతున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అయితే దీని పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు మరో చిత్రానికి రష్మికని తీసుకోవాలని భావిషతున్నాడట.

నాగచైతన్య తో దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మికని హీరోయిన్ గా తీసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. గతంలో గల్లా జయదేవ్ కొడుకు అశోక్ తో ఓ చిత్రం మొదలయ్యి ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కథని చైతూ తో తీయబోతున్నాడని తెలుస్తుంది. ఈ చిత్రంతో ఓ నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు. అంతేకాదు.. దిల్ రాజు మరో రెండు చిత్రాలకి రష్మిక ని హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నాడట. మొత్తానికి దిల్ రాజు… రష్మిక ని గోల్డెన్ లెగ్ గా భావించి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus