అల్లు అర్జున్ సరసన బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న రష్మిక

  • February 6, 2019 / 10:59 AM IST

అప్పటికే కన్నడలో సూపర్ స్టార్ డమ్ తోపాటు భారీ క్రేజ్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక మండన్న తెలుగులో తన పరిచయ చిత్రమైన “ఛలో” ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. “నేను “నా పేరు సూర్య” సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయ్యాను, ఫోటోషూట్ కూడా జరిగింది. కానీ ఎందుకో సినిమాలో నా బదులు అను ఎమ్మాన్యూల్ ని సెలక్ట్ చేసుకున్నారు” అని చెప్పుకొని బాధపడిన విషయం కొందరికైనా గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో అల్లు అర్జున్ సరసన ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు రష్మిక బాధపడినా కూడా.. ఆ సినిమా ఫెయిల్ అయినందుకు తప్పించుకొన్నాననుకొంది.

అయితే.. రష్మిక బాధను చూసి చలించిపోయాడో లేక “గీత గోవిందం” చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ చూసి ముగ్ధుడయ్యాడో తెలియదు కానీ.. అల్లు అర్జున్ ఆమెను తన తాజా చిత్రంలో కథానాయికగా ఫైనల్ చేశాడని తెలుస్తోంది. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న క్రేజీ ప్రొజెక్ట్ ను హారికా & హాసిని ఎంటర్ టైన్మెంట్స్ సంస్థతో కలిసి గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కథానాయికగా తొలుత కీయారా అద్వానీ పేరు వినిపించినప్పటికీ.. ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడంతో, ఆమె స్థానంలో రష్మికను ఆల్మోస్ట్ ఫైనల్ చేసేశారని తెలుస్తోంది. ఈ వార్త నిజమే అయితే.. ఆల్రెడీ యువ కథానాయికల రేస్ లో టాప్ పొజిషన్ లో ఉన్న రష్మిక అగ్ర కథానాయికల లిస్ట్ లో చేరిపోవడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus