కమెడియన్ రమేష్ భార్య ఆత్మహత్య వెనుక కారణం తెలిసింది

  • December 21, 2016 / 11:30 AM IST

బుల్లితెర ప్రేక్షకులను దిగ్బ్రాంతికి గురి చేసిన డ్యాన్సర్‌, హాస్య నటుడు చదలవాడ రమేష్‌ భార్య త్రిపురాంభిక ఆత్మహత్యకు గల కారణం బయటపడింది. ఆమె ఉరి వేసుకోవడానికి ఆడపడుచు వేధింపులే కారణమని పోలీసుల  ప్రాథమిక విచారణలో తేలింది. నెల్లూరుకు చెందిన త్రిపురాంభికను వైజాక్ కు చెందిన రమేష్‌కు గత ఏడాది డిసెంబర్‌ 12న పెళ్లి చేసుకున్నారు. గాజువాక శ్రీనగర్‌ లోని ఇంట్లో అమ్మానాన్నతో కలిసి రమేష్ దంపతులు కాపురం పెట్టారు. అదే ఇంట్లో అతని చెల్లెలు బావ కూడా ఉండేవారు. షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండేవారు. ఈ క్రమంలో ఆదివారం రమేష్‌ విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లారు.

సోమవారం ఉదయం త్రిపురాంభిక ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణించిన విషయం తెలిసి గాజువాకకు వచ్చిన త్రిపురాంభిక తల్లి పుష్పలత పోలీసులకు తన గోడు చెప్పుకున్నారు. తన కూతురుని వేధించి కడతేర్చారని ఆమె మంగళవారం ఫిర్యాదు చేశారు. ఏడాది కాలంగా తనను కట్నం కోసం సూటిపోటి మాటలతో వేధించారని, అత్తమామలతోపాటు ఆడపడుచు మహాలక్ష్మి, ఆమె భర్త మల్లికార్జునరావును శిక్షించాలని పుష్పలత కన్నీరు పెట్టుకున్నారు. ఈ మేరకు ఏపీసీ రామ్మోహనరావు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus