మహేష్ సినిమా ఆగిపోవడానికి కారణం ఇదే!

  • July 28, 2018 / 07:06 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలనీ అందరికీ ఉంటుంది. కానీ ఆ అవకాశం కొంతమందికే వస్తుంది. కానీ క్రిష్ ప్రతిభని మెచ్చి.. అతని దర్శకత్వంలో నటించడానికి ఒకే చెప్పారు. కానీ ఆ ఛాన్స్ ని సద్వినియోగం చేసుకోలేదు. వీరి కలయికలో మూవీ సెట్స్ మీదకు వెళ్ళలేదు. భరత్ అనే నేను సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలోనే మహేష్ మూవీ చేయాల్సి ఉన్నింది. కానీ అది వంశీ పైడిపల్లి చేతికి వెళ్ళింది. రైతు సమస్యల నేపథ్యం లో తెరకెక్కుతోన్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ త్వరలో గోవాలో మొదలుకానుంది. అయితే క్రిష్, మహేష్ మూవీ ఆగిపోవడానికి కారణం ఏంటో తాజాగా బయటికి వచ్చింది. ఆ విషయాన్ని క్రిష్ మెచ్చిన రచయిత సాయి మాధవ్ బుర్రా చెప్పారు.

“మహేష్ బాబు ఖాళీగా ఉన్న సమయంలో క్రిష్ బిజీ గా ఉండటం, మహేష్ బిజీ గా ఉన్నసమయంలో క్రిష్ ఖాళీగా ఉండటంతో ఇప్పటివరకు వారిద్దరూ సినిమా చేయలేక పోయారు. అయితే త్వరలోనే తప్పకుండా మహేష్ క్రిష్ లు సినిమా చేయడం ఖాయం. దానికి రచన చేసేది నేనే” అని సాయి మాధవ్ బుర్రా స్పష్టం చేశారు. దీంతో క్రిష్, మహేష్ కలయికలో మూవీ తప్పకుండా వస్తుందని తెలిసిపోయింది. ప్రస్తుతం క్రిష్ హిందీలో మణికర్ణిక సినిమాని కంప్లీట్ చేసి, తెలుగులో “ఎన్టీఆర్” బయోపిక్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల అన్ని పనులు పూర్తి అయిన తర్వాత మహేష్ స్టోరీ పై కూర్చోనున్నారు. మరి మహేష్ తో ఎటువంటి స్టోరీ తెరకెక్కిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus